నూతన వత్సరానికి స్వాగతం



ఆ క్రిస్మస్ చెట్టు నిండా బూరలే వున్నాయి 
కొవ్వూత్తుల వెలుగు చీకటిని చేదిస్తుంది
చేకటి కూడా సౌందర్యవంతమైనదే
అనేక సార్లు మనం కళ్ళు మూసుకొని 
ఆనందాన్ని అనుభవిస్తాం 
నిజమే
కళ్ళు తెరచి ఆ దృశ్యాన్ని చూడలేక పోయాను
శరీరానికి నిప్పంటించుకొని 
కాల్చుకోవడం చూడలేక పోయాను
ధర్మావేశం ఉద్యమ కెరటాలు లేపింది 
లోతైన గుండె కోత కలిగించింది 
నిజమే
వాళ్ళు అర్ధరాత్రిలో  చైతన్యం గా వుంటున్నారు 
అర్ధనగ్నంగా కేరింతలు కొడుతున్నారు 
ముక్కు రంద్రాల నుండి కొకెయిన్ పీలుస్తున్నారు 
జీవితానికి వారు అర్ధం చెప్పాలేక పోతున్నారు
రక్తం లోపల ఏ జేర్రులో జలగలో 
పారే అనుభూతి వారికి కావాలంట?
అవును
ఆ రాస్తా ముందు నెత్తురు 
వారగా పారింది
అమాత్యుల వారి సతుల వేగానికి
తారే కాదు గులకే కాదు 
భూమి పొరలు కూడా తట్టు కోలేక 
పోతున్నాయి 
వారికి చెక్కు బుక్కులు 
స్లీవ్ లెస్ జాకెట్లు 
స్వీయ గమనంలో వేగం 
వారిని అతలాకుతలం చేస్తుంది 
తండ్రులకు వీరికి తరాలుకాదు
యుగాల దాటివేత 
నిజమే
ఆ చేనేత శిల్పికి 
చేతికి రంద్రాలయ్యాయి 
మగ్గం అనేక సార్లు తడిసి ఆరింది 
ఆకాశం వైపు చూడడమే కాదు
నక్షత్రాలను లెక్క పెట్టడమా 
అతనికి తెలిసింది 
ఆకలికి ఓ ఖగోళశాస్త్రం వుంది 
అవును
ఆ యానాదులు చిన్న చేపలే పడతారు 
చట్టిలోనే ఇంత కూర యిగరేసుకుంటారు
ఈ బర్గార్లకూ , జీడి పప్పు మిటాయికి
గుండె నాళాలు మూసుకు పోయిన వారు 
మేము నాగరికులం 
అందుకే నాగలోకానికి ప్రయాణమయ్యాం  అంటున్నారు?
తల్లంటే యింటిలో దీపం వెలిగించేది 
ప్రభుత్వం దీపం ఆర్పుతుంది
అన్నం పెట్టలేనివాడు 
దీపం వెలిగించలేనివాడు
ఏమి ప్రభువు అనేది ప్రశ్న
అతనెవరు
శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నాడు 
ఒక సారి దేశాన్ని దోచుకునే
అవకాశం ఇవ్వమంటున్నాడు
చచ్చిన  ప్రతివాడికీ  సానుభూతే, రాజతర్పణే  
వంశ పారంపర్య  చీడ 
ఈ సంవత్సరం ఎన్నో పీడకలలు 
అయినాఏమి?
పోరాటం
చైతన్యం
రక్తాక్షరాలు రాసాయి 
మనిషి, మానవత 
వెలుగొందుతూనే వున్నాయి 
మూగవోయిన డప్పులూ, డోలక్కులూ
మోగుతూనే వున్నాయి 
రాజ్యాధికారం ఒక కేకే కాదు 
ఒక ఆచరణ కూడా 
నూతన వత్సరానికి  స్వాగతం 

Agenda for the Second SRC should be public administration.

Congress senior leader Digvijay Singh and AICC official spokesperson Rashid Alwi 's statement on Second SRC (States Reorganization Commission) are mere to confuse the people. Congress previously well known for double tongue but know it has become a four headed party. Now congress has become a party of Brahma, which has four heads. Congress has no intention to take any decision on any important issue it started dragging all the issues. Important thing is Second SRC statement has come into existence by the Mayawathi's statement to divide the UP into four states. As stated by many it is not election stunt but it is definitely a part of strategy. Congress habituated to destroy small parties is now engaged in different plans to face BSP in UP. According to the latest surveys in UP Mayawathi would regain the power in UP and the stunts of Rahul gandhi have failed. This is not the first time that Mayawathi has asked to divide the state. Kanshi ram itself has specifically stated that UP has to be divided into three states but would demand only after BSP would achieve 50 MP's. Now the question is Second SRC on what basis and on what agenda. According to Dr B R Ambedkar states should be reorganized so as to make the public administration easier. In the First SRC (States Reorganization Commission) the agenda was the linguistic based states, now when the population on India is 121 cores therefore the agenda for the Second SRC should be public administration.

National Entrance for medicine is a damage to the federal structure.


National Entrance for medicine is a decision causing damage to the federal structure in India. India is combination of different cultures and languages. India has independent languages like Telugu, Tamil, Malayalam, Guajarati, Marathi etc. Domination of both Hindi and English on the regional languages should be reduced. There is nothing wrong in establishing the global language English all over India but one should not force the students to write the exams in English leaving their regional language in which they have studied. In fact it is beyond the spirit of Indian Constitution. Coming on to syllabus it will be an irreparable lose to the students of SC, ST and BC. There would be a lot difference in state syllabus and central syllabus; therefore I believe that the exam should be conducted in the regional language with their own syllabus.  

నరకాసుర వధ కుడా ఓ హత్యే

నరకాసుర వధ కుడా ఓ హత్యే
అనార్య రాజులని చంపి పండగలుగా మార్చారు
దుష్ట సిక్షణని పేరు పెట్టారు
నరకుడు ఆర్య రాజ్యాన్ని 
నిరసించిన వాడు
వర్ణ వ్యవస్థను నిరసించిన వాడు
ఆర్య రాజులకు వత్తాసుగా కృష్ణుడు సత్య భామ అండతో నరకుడిని చంపాడు
ఇది దళితుల చరిత్ర
ప్రత్యామ్నాయ వాదులకు ఫూలే,అంబేద్కర్,పెరియార్ బాట

పక్షి వీక్షణం


పక్షి వీక్షణం
విశాలమైన పచ్చిక బయళ్ళు
ఆ మధ్యలో
ఏపుగా పెరిగిన ఒక చెట్టు
ఆ పైన రెండు పక్షులు
అవి తెల్లగా ఉన్నాయి.
ప్రపంచ పరిణామం గురించి ముచ్చట్లు
నిన్నటి ధనవంతుడు
నేడు పేదరికాన్ని నటిస్తున్నాడు
పేదవాణ్ణి అడిగి చిరుగు చొక్కాలు
ధరిస్తున్నాడు.

యుద్ధ నౌకల్లో సరుకుమాత్రం
లోడ్‌ అవుతూనే ఉంది.
తెల్ల భవనాల్లో
పావురాలమేతకేమి తిరుగు లేదు
డాలరుని ఒక
మారక ద్రవ్యంగా గాక
ఒక మత్తు మందులా చల్లారు.
మానవతా స్ఫూర్తిని విస్మరించి
ఎందరినో ఆకాశానికి
వేలాడ దీసి చూస్తున్నారు.

ఓ పక్షి అన్నది
‘ఒబామా ఎందుకు
రాత్రుళ్ళు నిద్రించటంలేదు’ అని?
నిద్ర చిన్న విషయం కాదు.
అది నిర్మలమైనవారికే వస్తుంది.
ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులు
చిన్న గూటిలో నిద్రిస్తున్నాయి
నాలుగు చెత్త పరకల పరుపుతో
ఒక తోడుతో, గుంపు జీవనంతో
ఏ సంకెళ్ళులేని జీవితం మనది.
సంకెళ్ళు వేయడమైనా
బిగించడమైనా
అదొక విద్యే!

ముసోలినీ, హిట్లర్‌ వంటివారందరిని
తెల్ల భవనం నిందించింది.
ఇవాళ్ళ వాళ్ళు చేస్తుందేమిటి?
మన ముఖర్జీలు, చిదంబరంలు
పార్లమెంటులో గారడీలు చేస్తున్నారు.
కనికట్టు విద్యతో
ప్రశ్న వేసినవాణ్ణి చిక్కుల్లో
పెడుతున్నారు.
అధినేత్రి చికిత్సకు
హాస్పటల్‌ కట్టుకోలేనివాళ్ళు
దేశాన్ని ఎలా పాలిస్తారు?
అందరూ శస్త్ర చికిత్సలకు
మంచు దేశాలకు వెడితే
ఇక సూర్యోదయ ఉపఖండాలకు
బతుకేది?

బొమ్మలేమో చైనావా!
చేతి ఫోన్‌లేమో జర్మనీవా!
కెమెరాలేమో సింగపూర్‌వా!
ఇక్కడ బియ్యమేమో
ముక్కి పోతున్నాయా!
అని రెండో పక్షి విశ్లేషణ చేసింది.
అవును తెల్ల దేశాలకంటే
బొగ్గు దేశాలకు మోజే!
అనుకరించటమే వీరిపని!
అమ్ముకోవడమే వీరికి వచ్చినపని!

ఆత్మగౌరవం తాకట్టులో ఉంది
చెత్తనేరే పిల్లల,
గాజు పెంకులు అతుకుతున్నవారి
అర చేతులన్నీ
నేటివిటీ మరకలే మరి!
మనలాగా మబ్బులు పల్లకీలు
వారికెక్కడివి?

చినుకు పడితే చిత్తడిలో
ఒళ్ళంతా పుండ్లు
జీవితానికి కునుకు లేదు
ఓ వీక్షణమా!

katipadmarమన దేశాన్ని మనం పచ్చగా చూడాలి!
ముందు మనసులకు
వ్యవసాయం
జరగాలి!
మనల్ని మనం
నిర్మించుకోవాలి!
అప్పుడే,
పునరుజ్జీవనోద్యమం
తథ్యం!

అన్యాయాలను చెండాడిన ‘కత్తి’


అన్యాయాలను చెండాడిన ‘కత్తి’
katti4ఉద్యమిస్తే చావో రేవో తేల్చుకుంటారు. కలంపడితే కాగితాల దొంతరలు సైతం దాసోహమనాల్సిందే. అందుేకనేమో... ఆయనకు మాస్‌ ఫాలోరుుంగ్‌ ఎంత ఉందో... అంతకు మించిన క్లాస్‌ అభిమానులూ ఉన్నారు. అంతమందిని కూడగట్టుకోవడం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులున్నారుు. అంతకు మించిన త్యాగం దాగుంది. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఏం చెప్పారో అది చేసి చూపారు ఈ డాక్టర్‌.

అందుేక పద్మారావును చాలామంది అభినవ అంబేడ్కర్‌గా అభిమానిస్తారు. అంబేడ్కర్‌ పుస్తకాలు చదివే ఓపికలేనివారు డాక్టర్‌ కత్తి పద్మారావు జీవితంలోని సంఘటనలు తిరగేస్తే చాలు... బాబాసాహెబ్‌ ఏం చెప్పారో, ఏం చేయమన్నారో క్షుణ్ణంగా అర్దమవుతుంది. పద్మారావు దళితుల కోసమే కాదు.. బాధిత అగ్రవర్ణాల అభాగ్యుల కోసం కూడా పోరాటాలు చేశారు. కత్తి పద్మారావు అంటే దళిత పక్షపాతే కాదు. మానవతావాది కూడా.

ఖణేల్‌... ఖణేల్‌... మంటూ నిప్పు కణికలు ఎగిసిపడుతున్నాయా? అంటే అక్కడ కత్తి పద్మారావు ఉపన్యసిస్తున్నారని అర్థంఆ గ్రంథంలోని పదం పదం హృదయాంతరాళను తాకుతోందా? అరుుతే అది కచ్చితంగా కత్తి పద్మారావు రచనే!.
katti3గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజులవి. కళాశాలకు సమీపంలోని బ్రాహ్మణ వీధిలో మాధవీలత అనే యువతి హత్యకుగురి కాగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనికి పోలీసులు వంతపాడారు. విషయం తెలి సిన పద్మారావు వాస్తవాలు సేకరించారు. మాధవీలతను అత్తింటి వారు పోసి కాల్చి చంపారని తెలిసింది. ఇన్‌స్పెక్టర్‌ చక్ర పాణి డబ్బు తీసుకుని కేసు మాఫీ చేసే ప్రయత్నం చేశారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.

కత్తి పద్మారావు ఉద్యమించారు. దీంతో చక్రపాణి ఉగ్రుడై పద్మారావుపై గుక్కతిప్పుకోలేని అక్రమ కేసులు బనాయించారు. కాలేజి నుండి ఆయనను సస్పెండ్‌ చేయించే ప్రయత్నం చేశారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపలేదు. ఇక కారంచేడు, చుండూరు ఘటనలలో ఆయన చేసిన సాహసాలే ఆయన్ను హీరోను చేశాయి. అప్పటి వరకు పొన్నూరు అంటే ఆచార్య ఎన్‌ జి రంగా, చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య పేర్లు మాత్రమే జాతీయస్థాయిలో వినిపించేవి. అయితే వారి పేర్లను వెనక్కు నెట్టి కత్తి పద్మారావు పేరు ముందువరుసలో నిలిచింది.

ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది!.కారంచేడు... చుండూరు... పేర్లు వినగానే ముందుగా గుర్తొచ్చేది కత్తి పద్మారావు పేరే! చెల్లాచెదురైన దళిత కుటుంబాలను ఏకం చేసి కన్నీరు తుడిచి ధైర్యం నూరిపోశారు. అంతేకాదు... అగ్రవర్ణ పెత్తందార్లు మరెక్కడా దళితుల ఊసెత్తే ధైర్యం చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెప్పించారు. ఉద్యమాలను ఆయన ఏసీ కార్లలో తిరిగి నడపలేదు.

భార్యాపిల్లలు ఆర్థాకలితో మాడుతున్నా, తన రక్తం చిందించి, నాసా కింద జైళ్లలో మగ్గి దళితులకు ఆత్మగౌరవ పోరాటాలు నేర్పారు. ఆయన ఏ ఉద్యమంలోనూ దళితుల్ని టోకున అమ్మే ప్రయత్నం చేయలేదు... దళిత దళారీగా మారనూలేదు. కనుకనే ఆయన పట్టుకున్న ప్రతి ఉద్యమం విజయం సాధించింది. కారంచేడు బాధిత కుటుంబాలకు చీరాలలో విజయనగర్‌ కాలనీ ఏర్పాటుచేశారు. ఇప్పుడా కాలనీలో విద్యావంతుల సంఖ్యే ఎక్కువ. ఇక చుండూరు దళితులు స్వపరిపాలన చేస్తున్నారు.

ఇదంతా ఒకవైపే. మరో పార్శ్వంలో ఆయన బ్రాహ్మణవాదానికి ప్రత్యామ్నాయ వాదాన్ని వినిపించడంలో ఉద్యమానికి మించిన పోరాటం చేశారు. జిల్లెల్ళమూడి సంస్కృత కళాశాలలో చదివే రోజుల్లోనే కుల ప్రభావం బాగా తెలిసొచ్చింది. కొ న్ని చదువులు కొందరికే పరిమితం చేస్తున్నారని గ్రహించారు. కునుకనే సంస్కృతం చదువును ఆయక ఒక ఉద్యమంగా చేపట్టారు. వేదాలు మొదలు... ప్రబంధాల వరకు అవపోసన పట్టారు. తర్వాత మార్క్సు, అంబేడ్కర్‌ గురించి పరిశోధనలు చేశారు.

ఈ సంస్కృతాంధ్ర పండితుడు తనలోని కవిని హేతువాదిని, చరిత్రకారుని, విశ్లేషకుని, తత్వవేత్తను మేళవించి రచనలు చేశారు. తన రచనల లక్ష్యం దళితుల చైతన్యమే. ఈ చలిచీమల దండును ఏకం చేసి బ్రాహ్మ ణవాదానికి ప్రత్యామ్నాయవాదం వైపు నడిపించటమే.

ఆయన కలం-గళం సమ్మిళితమైన ఆయుధం. కనుకనే 30ఏళ్ల వయసులోనే పెదపులివర్రులో శంకారాచార్య పీఠం నిర్వహించిన పోటీలో పాల్గొని శంకరాచార్యుల సిద్ధాంతం అశాస్ర్తీయమని నిరూపించి వాళ్లనుండే 10వేల రూపాయలు బహుమతి గెలుచుకున్నారు. మానవ పరిణామ క్రమంలో పోరాటం చేయని జాతి నశించి పోతుందని డార్విన్‌ మహాశయుడు చెపుతూ, ఉదాహరణగా అంతరించిపోయిన డైనోసార్లను చూపారు. అయితే పద్మారావు మరో అడుగు ముందుకు వేశారు. జ్ఞానం, విద్య, అవగాహన, నిర్మాణం... ఉన్న జాతులు నిరంతరం శక్తివంతమవుతాయని చెప్పారు.

చెప్పడమే కాదు... ప్రభావితులను చేసే ప్రయత్నంలో నిరంతరం కలాన్ని పరుగులు తీయిస్తూనే ఉన్నారు.అంబేడ్కర్‌ గ్రంథాలను ప్రతి దళితుని ఇంట్లో ఉండాలంటారు పద్మారావు. గృహ గ్రంథాలయాలను స్థాపించాలని చెప్పడమే కాదు... పొన్నూరులోని తన ఇంటినే పెద్ద గ్రంథాలయంగా మార్చారు.

katti1ఇక హైదరాబాద్‌లోని తన నివాసం కూడా రీసెర్చ్‌ సెంటర్‌గా మార్చారు.. పద్మారావు నిడమర్రులోని చార్వాల ఆశ్రమంలో స్వర్ణకుమారిని కులాంతర వివాహం చేసుకుని... వేల సంఖ్యలో కులాంతర వివాహాలు చేశారు. అంతేకాదు... తన ఇద్దరు తమ్ముళ్లకు, కుమారునికి కూడా కులాంతర వివాహాలే చేసి ఆదర్శాన్ని చాటారు. ఆయనకు భార్య స్వర్ణకుమారి. కుమార్తె సృజన, కుమారులు చేతన్‌, లోకాయత్‌లతోపాటు కోడలు నళిని నుండి కూడా పూర్తి సహకారం అందుకుంటున్నారు.20 దేశాలు పర్యటించిన పద్మారావు అక్కడ ఉపన్యాసాలతో సరిపెట్టుకోలేదు.

ఆయా దేశాల్లో ఎటువంటి వివక్ష ఉందో వాటి మూలాలు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ హేతువాదిలోని తత్వవేత్త ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పారు. కనుకనే ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో ‘కత్తి పద్మారావు-దళిత సాహిత్యం’పై పరిశోధనలు ప్రారంభమ య్యాయి. ఇప్పటికే అమెరికాలోని క్యాలిఫోర్నియా, ఢిల్లీ, హైదరాబాద్‌లలోని సెంట్రల్‌ యూనివర్శిటీల నుండి ముగ్గురు స్కాలర్స్‌ పిహెచ్‌డి పొందారు.

మరెందరో ఇదే ప్రయత్నంలో పద్మారావు రాసిన పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. అక్షరం దిద్దని తల్లిదండ్రుల కడుపున పుట్టిన పద్మారావు నేడు మార్గనిర్దేశకుడుగా మారారు. పండిత పుత్రులు కూడా ఒక్క గ్రంథం రాయాలంటేనే ప్రసవ వేదన పడుతుంటే ఆయన 58 ఏళ్లకే 56 పుస్తకాలు రాశారు. ఆయన సెంచరీ దాటిస్తారని ఆశిద్దాం...
ఆయన సమాజం నుండి మంచిని గ్రహించి సమకాలీన ప్రపంచానికి పంచే ప్రయత్నం చేస్తున్నారు. ధనానికీ, వ్యామోహానికీ, ఆధిపత్యానికీ, ఆభిజ్యాత్యానికీ లొంగలేదు. కనుకనే ఆయనకు భీతిలేదు. అనారోగ్యంతో శరీరం సహకరించకపోరుునా ఆయనలోని తృష్ణ ముందుకు నడిపిస్తోంది. 
సూప్‌కి...గంజికి తేడా ఉంది....
katti2ప్రాస కలిసింది కదా... అని స్టార్‌ హోటల్స్‌లో భోజనానికి ముందు సూప్‌ పేరుతో ఇచ్చే గంజితాగిన వారు... ‘గం జికి-బెంజి’కారుకు ముడిపెడితే ప్రజలు నమ్మరు! అయితే పద్మారావు జీవితంలో కనిపించే ఈ గంజి... బడుగుల జీవన చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది... పద్మారావు చిన్నతనం లో చీరాల ఐఎల్‌టిడి కంపెనీలో పనిచేసేవారి మూడు కాలనీల లో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి. అక్కడి పేద ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు.

వారి ఆకలి తీర్చాలని ఉన్న బియ్యంతో గంజి కాశారు. అక్కడే సమస్య ఎదురైంది! గంజి ఆరిపోతే గడ్డకట్టి పోతుంది. పైగా తాగేవాళ్లకు కూడా మింగుడు పడదు. ఇక వేడివేడి గంజి పోద్దామంటే కనీసం పాత్రలు లేవు. దోసిట్లో పోయలేరు. అక్క డున్న పద్మారావు పిల్ల గ్యాం గ్‌ క్షణాల్లో ఊరి చివరి డొం కలోకి వెళ్లి తాటాకులు కొట్టుకొచ్చి డొప్పలు తయా రుచేశారు. దాంట్లో వేడివే డి గంజి సప్లై చేశారు. ఎం డిన డొక్కలు పూడకపోయి నా.., వాళ్ల కళ్ళల్లో మాత్రం తృప్తి. ‘పేదరికం చూశాను కనుక గంజి విలువ తెలుసు. చిన్నతనంలో ‘సువార్త దళం’ పేరుతో మా పిల్ల గుంపు చేతనైన సహాయం చేసేది. బైబిల్‌ క్లాసులు భాష, సేవాభావాన్ని నేర్పాయి. క్రీస్తు పాటలు పాడడం, నాటకాలు వేయడంతో స్టేజ్‌ ఫియర్‌ పోయింది...’ అంటారు.

గుండెల్లో నిద్రపోతా...
ఇదేం సినిమా డైలాగ్‌ కాదు... చుండూరు ఊచ కోత కు గురైన దళితుల శవాలను ఆ గ్రామంలో సమా ధి చేయించే ప్రయత్నం చేశారు పద్మారావు. ఆ చుట్టుప ట్ల ఉన్న గ్రామాలలోని రెడ్డి కులస్తులేకాదు... అగ్రకులా లు మొత్తం ఏకమై తిరగబడ్డాయి. ఢిల్లీ నడిబొడ్డులో గాంధీని, ఇందిరాగాంధిని సమాధి చేయలేదా? అని పద్మారావు ప్రశ్నించారు. మనువాదులు ఏ దళితులనైతే ఊరి చివరికి నెట్టాలనుకున్నారో వారికి దిమ్మతిరిగిపో యేట్టు ఊచకోతకు గురైన దళితుల శవాలను ఊరి మధ్య ఖననం చేయించారు. పైగా అగ్రవర్ణాలకు నిద్రలో గుర్తుకొచ్చినా ఉలిక్కిపడే విధంగా ఆ స్థలానికి ‘రక్త క్షేత్రం’ అని పేరు పెట్టారు.

 ప్రొఫైల్‌
తల్లిదండ్రులు : మాణిక్యమ్మ, సుబ్బారావు.
పుట్టిన తేదీ  : 27 జులై, 1953
స్వస్థలం  : ఈతేరు , గుంటూరు జిల్లా
పురస్కారాలు : 1992లో అంబేడ్కర్‌ అవార్డు,
    2003లో  సినారె సాహితీ 
    పురస్కారం, 
    2006లో ఆంధ్ర సారస్వత 
    పరిషత్‌ అవార్డు,
    2006లో పొట్టి శ్రీరాములు 
    తెలుగు యూనివర్శిటీ అవార్డు, 
    2006 బోరుు బీమన్న ట్రస్ట్‌ 
    అవార్డ్డు,
    2008లో ఆచార్య నాగార్జున 
    విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌
    2010లో ‘మహాకవి’ బిరుదు

-వేణుగోపాల్‌ తలతోటి

జాలాది పాట తరతరాల వాడని పూల తోట


జాలాది పాట తరతరాల వాడని పూల తోట 
విత్తనం నుండి మొలకెత్తిన బోధి వృక్షం 
నది అలల నుండి పుట్టిన ఏల గీతం 
గూడెం గుండెల నుండి ప్రవహించిన జానపదం 
వేమన తత్వం,జాషువా కవిత్వం 
పోతులూరి మాట, ధర్మన్న బాట 
జాలాది పాట తరతరాల వాడని పూల తోట 

నేటి శిశువు రేపటి వెలుగు రేఖ

నిరంతర సృష్టి సమాజ పరిణామానికి ఆయువు
నేటి శిశువు రేపటి పౌరుడు,మేధావి,శాస్త్రజ్ఞుడు,వెలుగు రేఖ
ఆడ శిశువు ప్రకృతి ప్రతిరూపం
శిశువుని చిదమడం అంటే జీవన వ్యవస్థపై గొడ్డలివేటు వేయడం
విత్తనాన్ని భగ్నం చేశాక వృక్షం ఎక్కడి నుండి వస్తుంది?
పునాదులను నిర్మించాల్సిన మనిషి వాటిని తవ్వేస్తున్నాడు
దీనికి మూలం లింగ,కుల వ్యవస్థలే
మెదడు సారవంతమైనప్పుడే సమాజానికి భవితవ్యం !!

మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు


పండితుడు అంటే అధ్యయనపరుడు
మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు
బుద్ధుని తరువాత సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు అంబేడ్కరే
అందుకే ఆయన మేధావి
మన పండితులు తిలక్,గాంధీ,నెహ్రు,ఠాగూర్,వివేకానందుడు
వీళ్ళందరూ సమాజాన్ని వ్యాఖ్యానించినవారే
అంబేడ్కర్ సమాజ పునర్నిర్మాణానికి సూత్రాలను నిర్మించారు
సమధర్మం,సత్యవాక్కు,సునీతి,సహనత,సచ్ఛీలత,సమ్యక్ దృష్టిని బోధించారు
అందుకే ఆయన మహా బోధి
రెండువందల భాషలు,వివిధ మతాలు,జాతులు కలసి జీవించే ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన మేధావి
ఆయనే నేటి భారతదేశ పునర్నిర్మాణానికి మార్గం.

మతోన్మాదం పేరుతో ఎంత నెత్తురు భూమిని తడిపిందో!

బడిలో పిల్లోడికేమో వుడికీ వుడకని అన్నం
మనిషి చేత్తో చేసిన మట్టి బొమ్మలకేమో వుండ్రాళ్ళ నైవేద్యం
మనిషి చేసిన దేవుడు మనిషినే తనకు బానిస చేసుకున్నాడు ఆలోచనా శక్తిని చంపి వున్మాదానికి తెరలేపాడు
మనిషి అనేకం సృష్టించాడు...
అన్నీ మనిషి అదుపులోనే వున్నాయి
ఒక్క దేవుడు మాత్రం మనిషిని మత్తులో ముంచుతున్నాడు
మతోన్మాదం పేరుతో ఎంత నెత్తురు భూమిని తడిపిందో!
మనిషి హేతుమతైనప్పుడే విజ్ఞాన వికాసం!!

మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!

బ్రాహ్మణుల్లో పండితులేగాని మేధావులు లేరని అంబేద్కర్ చెప్పారు
ఇది అక్షర సత్యం
మానవుణ్ణి విభజించడం ధర్మమెలా అవుతుంది ?
సామాజిక సంబంధాలు చిక్కబరిచింది బుద్ధుని తరువాత అంబేడ్కరే
ఇతరుల శ్రమను దోచుకోవడం బ్రాహ్మణ ధర్మం
ఇతరులను ప్రేమించడం దళిత ధర్మం
దళిత పల్లెల్లో ఇప్పటికీ భౌద్ధ సంస్కృతే వుంది
మానవత్వ పరిమళాలు ప్రసరిస్తున్నాయి
మనిషి మనుగడకు ఊపిరి కరుణ, ప్రేమలే
మనిషి పూజించాల్సింది రాతి విగ్రహాలను కాదు
మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!

కొవ్వొత్తుల ప్రదర్శనతో చీకటి పోదు

                                                                                                             29.8.11
అన్నా హజారే ఊరిలో మాంసం తింటే
దళితులను చెట్టుకు కట్టేసి కొడతారు   
హజారే అక్కడొక  మనుస్మృతి రాజ్యాన్ని నిర్మించారు
నీతి పేరుతొ హిందూ పునరుద్ధరణవాదం
మనిషిని విభజించే మనువాదం
గ్రామ రాజ్యం పేరుతో మళ్లీ వస్తుంది జాగ్రత్త!
అవినీతి పుట్టుక బ్రాహ్మణవాదంలోనే ఉంది
రాళ్ళపేరుతో రప్పలపేరుతో యితరుల సొమ్ము
కైంకర్యం చేస్తూనే వున్నారు
కొవ్వొత్తుల ప్రదర్శనతో చీకటి పోదు
ముందు మెదడులలో వెలుగునింపండి
సమసమాజ రూపం రాజ్యాంగంలోనే దర్శనమిస్తుంది
అంబేద్కర్  శిల్పం  ఇక్కడే  ఉంది.

అన్నా హజారే పోరాటం అర్థసత్యమే

                                                                                                   22.8.11
రామలీల మైదానంలో కేకలు 
భారత పార్లమెంటులో
రణగొణ  ధ్వనులు

ఎవరిని దించి
ఎవరిని ఎక్కిస్తారు ?
అందరూ!  ప్రజల సొమ్ముతో
పల్లకీలు ఎక్కిన వారేగా !!
ఊరు బయట వాడ
గట్టిన  ధర్మజ్ఞులేగా...

మనుషులను విడదీసిన
ధర్మ దండం వీరిది
అస్పృశ్యతా నిర్మూలన కోసం
గాంధేయ మేమైయ్యింది?

మనిషిని మనిషి
అంటుకోకపోవడం నేరం కాదా ?
దానిపై కొరడా ఎత్తరే!!

మరో స్వతంత్ర  పోరాటం
చేయవలసింది దళితులే ....
వారి శ్రమకు ఈ దేశం
ఋణపడి వుంది.

 

రాజ్యాంగానిదే విజయం

                                                                                22.8.11
అవినీతి పతాకలెత్తి
నడుస్తున్నాడు జగన్
ప్రతి రాజు మరణం వెనుక
ఒక పెద్ద కుంభకోణమే ఉంది.

విదిలించిన మరమరాలకు
వచ్చిన కీర్తి అపారం.
దోచేసిన ధననిధులఫై
లేదు నిఘా!

రాజుల కొడుకులందరూ మళ్ళీ ప్రభువులైతే
ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటి ?
ముందు గొయ్యని తవ్వనివ్వండి
బాబులు, బాబాలు, స్వాములు
అందరూ దొరుకుతారు

ఇప్పుడు న్యాయస్థానం
అంబేద్కర్ మార్గంలో నడుస్తుంది
ఇక రాజ్యాంగానిదే విజయం.

విజేత

                                                                                    19.8.2011
మనిషికి ఊపిరి జ్ఞానం
మనిషికి నడక జిజ్ఞాస
మనిషికి వికాసం పరిశోధన
మనిషి సంఘజీవి
మనిషి అభివ్యక్తే కావ్యం
మనిషి ప్రపంచానికి
విస్తరిస్తున్నాడు
ప్రపంచం మనిషికి
దగ్గరవుతుంది
ప్రపంచీకరణ మనిషికి
అధీనమవుతుంది
అంతిమంగా
మనిషే విజేత!

అన్యాయం ఏదైనా నిలవేయడం ఓ చరిత్ర

                                                                                                             17.8.11
ప్రజల్లో వచ్చిన కదలిక
ప్రజ్వలించటం ఓ హక్కు
అన్యాయం ఏదైనా
నిలవేయడం ఓ చరిత్ర

పర్వతాల పై నుండి
కిందకు బొట్టు జారడం లేదు
దోసిలి బట్టినోడు
ఆకాశంవేపు చూడడమే తప్ప
దప్పిక తీరడం లేదు

జేబుల్లో కుక్కుకునేవారు కొందరు
డొక్కల్ని ఎండ బెట్టుకునేవారు కొందరు
దిక్కులన్ని పిక్కటిల్లేలా
అరుస్తున్న అరుపులు

ఆఫీసుల్లో వున్న అధికారులకు
వినిపించని ఉరుములు
జీవన సంక్షోభమంతా
యిచ్చేవాడికి తీసుకునే వాడికి
మధ్యనున్న చేతులే సృష్టిస్తున్నాయి
యిచ్చేవాడే మింగేస్తే
ఇంకా పాలనేముంది?
పాలకులేమున్నారు?

ఉద్యమమేదైనా
కొవ్వొత్తిలానే వెలుగుతుంది
సూర్యగోళం అంత కావడానికి
ఎంతోకాలం పట్టదు.

స్వాతంత్ర్యం జిందాబాద్ !!

                                                                                                      15.8.11
అరవై ఐదు ఏళ్ళ స్వాతంత్ర్యం
నలభై ఐదు శాతం మందికి
చదువు లేదు !

అప్పు ఒక మంత్రం,
అవినీతి ఒక తంత్రం
పార్లమెంటు ఒక యంత్రం

దిల్లు లేని బిల్లులు
పాసవడం ఒక ఫార్మాలిటీ

మూడువేల ముప్పైమూడు కోట్లు
గిరిజనుల కోసం
తవ్వుకు వెళ్ళే నిధులు మాత్రం
లక్షల కోట్లు

కంటికి దృశ్యం కనబడుతుంది
చెవికి శబ్దం వినబడుతుంది
2జి లు , 3జి లు ఓకే

రొట్టె మాటేమిటి ?
రాజ్యంలో భాగస్వామ్యం మాటేమిటి ?

స్వాతంత్ర్యం నాడైనా
అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా
 ప్రశ్నించనివ్వండి

స్వాతంత్ర్యం జిందాబాద్ !!

మనిషి మనుగడకు మాతృ భావనే ఊపిరి

                                                                                                14.8.11
అవును!
వారు ఆడశిశువుని
ఆహ్వానించలేకపోతున్నారు.


సృష్టిని నిరాకరించి
ఎడారిలో పయనిస్తున్నారు.

స్త్రీలు ప్రాకృతిక శక్తులు
ప్రపంచ మూలాలు
వారి జీవనంలో ఉన్నాయి.

లింగ భేదం
సమతుల్యానికి గొడ్డలిపెట్టు
ప్రకృతి సృజనాన్ని కోల్పోతే
తుఫానులు తప్పవు.

మాతృత్వం ఒక కళ కాదు !
వాస్తవం !

ప్రతి మనిషి మనుగడకు
మాతృ భావనే ఊపిరి .
"आरक्षण" एक समाजक विद्रोह
बिना रोटिका पाध्ये और 
हजारो दीपोमका नेचे पाध्ये
दोनोमे तलेंट किस्काहे ?
फ़िवे स्टार होतेल्मे रहने वलोमको 
क्या पता ?
 बिना  रोटी कपड़ा और माकन से 
 स्टार कैसे बने . . . 
इस  मिल्लें निउम्की 
 सब से बड़ा तालेंतेड
 बुध 
महात्मा फुले
आंबेडकर 
टीनू  ब्रह्मिन नहिहेना ?
 भारत  देश में रहेने वलोमको
राज्यम्गा ध्रुस्ती आवश्याहे 
  सामाजिक ध्रुस्ती से जो नहीं देह्क्सकता 
 ओ अन्धो जैसे हे . . .

రాజ్యాంగపు చూపు అవసరం

                                                                                                   12.8.11
'ఆకర్షణ్' ఒక
సామాజిక విద్రోహం

రొట్టెలేని వాడి చదువా
వేయి దీపాలలో చదువా
ఏది ప్రతిభావంతం?

ఫైవ్ స్టార్లో జీవించేవాడికి
మురికి వాడ నుండి
నక్షత్రంలా వెలగడం
ఏమి తెలుసు?

వెయ్యేళ్ళలో
ప్రతిభావంతులుగా వెలిగిన
ఓ బుద్ధుడు
ఓ మహాత్మాఫూలే
ఓ అంబేద్కర్
బ్రాహ్మణులు కారు కదా!

భారత దేశంలో బ్రతికేవాడికి
రాజ్యాంగపు చూపు అవసరం
సామాజిక దృష్టి లేనివారు అంధులే. 

వారి స్వేదం నుండే!

                                                                                                           ౬.౮.11
ఆకాశం ఉరుముతూ ఉంది
ఒక్క చుక్క పడటం లేదు !
అక్కడ జడివానే పడుతుంది !
ఆ  దాన్యాగారాల మీద కప్పు లేదు
చెట్టు ఊపితే పూలే కురుస్తాయి
కాయలు పండ్లు కావడం లేదు

అవును!
అంతా పూల దారే
ఏదో సంగీతం వినిపిస్తుంది
ఇన్ని కోట్ల మంది
ఊపిరి పీలుస్తున్నారంటే
ఆ ఊగుతున్న చెట్టుకు
ద్వేషం లేదు మరి!
శ్రామికులూ అంతే
అన్ని ఉత్పత్తులను
సృష్టిస్తునారు
వారి స్వేదం నుండే
సమాజానికి ఉనికి

ప్రజల చైతన్యమే అన్నింటికీ పరిష్కారం

అధిక ధరలు పార్లమెంట్ ను కుదిపాయి.
మంచి ఆంగ్ల భాషలో సమాధానాలు కురిసాయి .
బోర్డర్ అంతా టెర్రరిజంతో నిండింది,
మరి రక్షణ కోసం ఖర్చుపెట్టే లక్షల కోట్ల సంగతేంటి ?
తప్పుకోవడమే రాజకీయ క్రీడా !
మంత్రివర్యులు ప్రతివాదంలో ప్రావీణ్యులు
సమస్యలకు పరిష్కారాలు వారిదగ్గర లేవు
ప్రజల చైతన్యమే అన్నింటికీ పరిష్కారం !

వీక్షకులా... ఆలోచనాపరులా...

                                                                                                 ౧.౮.11
నిర్భాగ్యులూ, అనాధలూ,
నిరాశ్రయులు పెరుగుతున్నారు.
కోట్లకు పడగలెత్తిన వారి
బంగళాలూ పెరుగుతున్నాయి.

ఈ వైరుధ్యాల మధ్య
ప్రభుత్వం ఒక నాటక శాల.

అవును!
ఆలోచించని వారే ఘనులు
ఆలోచిస్తే అంతరాలు సాక్షాత్కారం
విద్యావంతులు దేశాన్ని
కంటతా పెడుతున్నారా!
వీక్షకులుగా మిగులుతున్నారా!

ఏ మనిషైనా
పురోగామిస్తే అంబేద్కర్.
తిరోగామిస్తే గాంధీ.
 

అధికారం మత్తేకాదు వంచనకూడా!

                                                                                                         30.7.11
గిరిజనులు మన్యంలో
జ్వరపీడితులు
మంచాలకు కట్టుకొని
మైళ్ళకు మైళ్ళ దూరాలకు
కాలినాడకలో.
రాజీనామాలకూ,
రాజీపడడానికి
ఏంపీలేమో విమానాలపై
ఉరుకులు.
ప్రాణాన్ని రక్షించడానికి
వాహనంలేదు
పదవిని రక్షించడానికి
బహు వాహనాలు
అవును!
అధికారం మత్తేకాదు
అధికారం వంచనకూడా!



గాంధీ మార్గమే ఒక సున్నా

                                                                                                              29.7.11
మనిషిని మళ్లీ
మనిషి చేయడం
అసాధ్య చర్య.
రుగ్మతలన్నింటి సమాహారంగా
నేటి మనిషి.
పుట్టుకను మరచిన మనిషికి
గమ్యమూ లేదు.
గమనాన్ని నిర్దేశించేది
రూపాయి అయినప్పుడు
నీతిని అవినీతిగా
మార్చడమే ఆధిక్యమైనపుడు
బిల్లులూ చట్టాలూ
మార్పులు తెస్తాయా!
అన్నా! గాంధీ మార్గమే
ఒక  సున్నా.

Birthday wishes

నల్ల కలువ పుట్టిన రోజు...వాడలోకి నల్ల సూర్యుడు నడిచి వచ్చిన రోజు... Afsar Mohammed

wish u happy birth day. meeru dalithula kosam marinni udyamaalu cheyalani korukunta. Laxminarayana Masade

Many happy returns of the day.May you continue to excel in your fight against discrimination and betterment of the society... Ronald Ernest

MANY HAPPY RETURNS MAY YOU CONTINUE TO CONTRIBUTE TO CASTELESS AND JUST SOCIETY - RANJANI

wishes u happy birth day and on the occasion of your birthday we also feel that our country needs thousand "padma rao's" to change the Indian society and wishes u all the best in this year for your activities for the Dalit communities- TSA EFLU

కత్తి పద్మారావు గారు! సమాజంలో మనుషుల జీవితాలను మరింత కాలం ప్రభావితం చేయడానికి,మనుషులను మరింత ఉన్నత మానవులుగా మార్చడానికి,మానవ సమాజాన్నే మరింత పరిపూర్ణమయిన మహోన్నతమయిన సమాజంగా దిద్ది తీర్చడానికి, మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని,నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యంతోను,సుఖ సంతోషాలతోను,గడుపుతూ సమాజంలో ఇప్పటి మీ కృషి,ఇలాగే అర్ధవతంగా కొనసాగించాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను..........c​ontd........ Sambasiva Rao Kakani

Jai phule...jai bhim....jai mulavaasi....jai telangana...jai andhra...Dalita ashaa jyothi Padma rao gariki janmadina shubhakankshalu.....Aluperagan​i mi poratam Dalithulaki adikaram vachedakedaka mi venta memu untam ani cheputhu.....my sincere request z dt plz spread jai Andhra movement among seemandhra ppl.....bcoz ppl lik u hav 2 f8 frm andhra in order 2 get our Telangana state....hoping for d best and hav a wonderful life ahead...... Karthik Thadishetty


My Advanced Birth day wishes to Dr.Kathi Padma Rao Garu ...The Champion of Dalit Movement in Andhra Pradesh .. He has awoken the people of Andhra Pradesh through his speeches ..writings and bringing the Ideology of Ambedkar to all sections of the people to understand Dr.B.R. Ambedkar in a better way ... Dr. Kathi Padmarao Garu is an Inspiration to lakhs of people ...Kranthi Kumar Korabandi
 
I thank each and every one who renedered their valuable wishes on my Birthday.

బానిసత్వం

                                                                                                    28.7.11
గుడ్ల గూబల్లా
రాజకీయ మర్రిఊడలకు
వేలాడుతున్న నాయకులు
ద్వంద్వ ప్రమాణాలు
నిర్మిస్తున్నారు

తాకట్టులో వున్న భారతం
మెదడుల్లో గూడుకట్టుకున్న
బానిసత్వం
బానిసలకు బానిసలను
సృష్టిస్తూనే వుంది.

అవినీతి పరులందరినీ
జైళ్ళలో కుక్కితే
ఊరు వాడవుతుంది
వాడ ఊరవుతుంది.

  


సూరీడు ఎక్కడో లేడు!

                                                                                                            ౨౬.౭.11
చినుకులు పడుతున్నపుడల్లా
ఆకాశం భూమికి వాలినట్లు
సముద్రం పక్కనే ధ్వనించినట్లు
ఆకులు  ముత్యాలతో
అలంకరించుకున్నట్లు ఉంటుంది.  

కానీ, ఆ వాడ మధ్యలో పారుతున్న
మురుగు కాలువ
స్వయిన్ ఫ్లూ, డెంగ్యు, మలేరియాలను
వ్యాప్తిచేస్తూ   వెళ్తుంది.

ప్రకృతి  రమణీయత  శిధిలమౌతుంది
మనోవైకల్యాలు ప్రబలుతున్నాయి
మనుషులు  అనారోగ్యంతో
కునారిల్లుతున్నారు
ఈనాటి  చినుకు భారతం యిదే!
కునుకులేని జీవుల ఆర్తనాదం కూడా యిదే!

మసకపడడానికీ,
వెలుగురావడానికీ మధ్య
గీతలులేని బ్రతుకులు.

నిజమే!
సూరీడు ఎక్కడో లేడు
ఆలోచనల్లో, గుండెల్లో ......

         









ఎటో తేల్చుకోండి!

                                                                                                            25.7.11
సూర్యోదయంలో
రంగులీనుతున్న అడవి
ఆ పక్షులు ఆకాశానికి
రంగులద్దడానికి
పయనిస్తున్నాయి.

మనుషులు ఒళ్ళంతా
చిత్రచిత్ర వర్ణాలు
పొడిపించు కుంటున్న
ప్రతిసంధర్భంలో
అడవి నవ్వుతూనే వుంది!

కొమ్మను అంటిపెట్టుకున్న
అత్తిపండ్లనిండా జీవులు
బ్రతుకుతూనే వున్నాయి.

నిజానికి,
ఆ చిరుతపులి కంటే
ఆ రంగుల పక్షే
స్వేఛ్చగా బ్రతుకుతుంది

నీతి అవినీతి రెండే రంగులు
ఎటో తేల్చుకోండి!

సామాజిక అంతరాలు రగులుతున్న కొండలే!


                                                                                                                      22.07.11
మరణించిన వాణ్ణి పూడ్చడానికి
చారెడు నేలలేదు
విదేశీ కంపెనీలకు
వేలవేల ఎకరాల ధారాదత్తం

హిల్లరీ క్లింటన్
ఆసియా సంపన్న మైనదని
పొగుడుతుంది
తెల్లవాళ్ళ కన్ను
భూమి మీదకు కాదు
భూమి పోరాల్లోకు కూడా
చొచ్చుకెళ్తుంది

శ్రీలంక తమిళుల
మీద వున్న ప్రేమ
భారతదేశంలో దళితుల
మీదలేదే!

అణచివేత ప్రపంచం అంతటా వుంది
సామ్రాజ్య వాది
తన అవసరాల కోసమే మాట్లాడుతుంది
సామాజిక అంతరాలు
ఎప్పుడూ రగులుతున్న కొండలే!

అడ్డుగోడలెవరు?

                                                                                                                                 20.7.11
స్టార్ హోటళ్ళలో
పసందైన విందులు
చినుకు చిత్తడిలో
ముద్దవుతున్న పసికందులు
అసమ సమాజంలో
మిట్టలపై లోయలపై
ఒకేచూపు
కొండపై కెక్కినోడు
కింద వైపు చూడడాయె !
లోయలోని గడ్డిపూలకు
సూర్య కిరణాలు తగలకుండా
అడ్డుగోడలెవరు?

చూసే చూపును మార్చండి!

                                                                                                    19.7.11
అస్పృశ్యతా భావం
రూపాలు మార్చుకుంటుంది
ముఖ ముఖానికీ
కళ్ళలో భావాలు మారుతున్నాయి
తెల్ల ద్రాక్షాలకంటే
నల్ల ద్రాక్షాలే అందమైనవి
భూమినుండి తొలుచుకు రావడం
ఒక నేరమా!
ఆకాశం నుండి కురవడం
ఒక వరమా!
వెన్నెలకంటే చీకటి నిడివే పెద్దది
ముందు చూసే చూపును మార్చండి
కొత్త ప్రపంచం కనిపిస్తుంది!

చరిత్రను మార్చడమే ఉద్యమం

                                                                                                            17.7.11
కారంచేడు మృతవీరులు
చిందించిన రక్తం
దళితుల చరిత్రకు
ఎత్తిన పతాకం
యుద్ధ యోధులుగా
మరణించిన వారెవరైనా
చరిత్ర గుండెలపై
శిలా శాసనాలే అవుతారు
చరిత్రను వల్లించడం కాదు
చరిత్రను మార్చడమే ఉద్యమం

What happened in Karamchedu?

Karamchedu village is located 7 km off from Chirala in Prakasam District of Andhra Pradesh State. The village was a big Panchayat with 16 wards. Kammas, the landlord community, lived in eight wards. Other eight wards comprised of BC, SC and ST people. Dalits resided in the 16th ward. As Kammas outnumbered people of other castes, they had the last word on everything. Kammas were very rich, they were arrogant. No wonder, Karamchedu was ridden with obnoxious feudal culture. There was no place for modern and progressive ideas in the village. The Kamma caste ruled the roost. Yadavas, Rajakas, Nayibrahmins, Upparas, Chundu nayaks, Muslims, Yerukulas, Yanadis, Malas and Madigas were living in the village. Kammas owned thousands of acres of land. They presided over and decided all village affairs. The big shots among them included families of Daggubati, Chaganti, Yarlagadda, Perni, Manda and Puvati. The fattened Kammas ill-treated, humiliated and physically asaulted workers who toiled in their houses. They were also known to murder their workers and the corpse dissapeared for ever. Ten years before the Karamchedu carnage, Upperas, Backward Caste people, rebelled against brutality of Kammas. The latter frequently raided Upperapalem and attacked Upperas. Venkateswarlu, a Chundunayak leader, tried to organise peasants for a wage hike. Kammas barbarically assaulted him. Venkateswarlu ranaway and hid himself in the Madigapalle. Kammas asked Madigas to hand over Venkateswarlu to them. Madigas rejected Kammas' demand. They told Kammas bluntly that they would protect Venkateswarlu at the cost of even their lives. Unable to face Madigas, they went back. Kammas, from that day, nurtured hatred against Madigas. Later they attacked Malas. Madigas rescued Malas. That incident further enraged them. They were only waiting for a ruse to settle scores with Madigas. The Madigapalle of Karamchedu wa full of self-respect. Four hundred families had the same surname. Families of Tella and Duddu were the main force of Madigas. They were all warriors and experts in karrasamu. They used to perform martial art with sticks to the rhythm of billamgodu tune. Yehoshua was the best among them. The Madigapalle was bound by a code of conduct. Elders watched over its strict adherence. Madigas were agricultural labourers. Though they depended on Kammas for their modest living, they never compromised on self-respect. They fought to the end in defence of their dignity. Kammas flourished on all fronts all over the State. In Karamchedu, with the help of Kuppuswamy, a Justice Party leader, and Congress and Communist party leaders, they accumulated wealth and properties. Kammas, from the beginning, maintained a unique nature. Rank selfishness had always been in their blood. They worked in different parties. But they joined hands in protecting their caste interests and hegemony. The Karamchedu landlords had become very rich. They raised cotton, tobacco and other cash crops along with traditional crops. They monopolized trade, moneylending business and particularly cinema industry. The Telugu Desam Party, which was set up to counter Reddy politics, had its roots in Karamchedu. The village landlord, Daggubati Chenchuramaiah, was related to TDP leader N. T. Rama Rao. His son, Daggubati Venkateswara Rao, was married to NTR's daughter. Relationship with NTR had only added to the arrogance of Karamchedu Kammas. Police and revenue officials became henchmen of Daggubati family. With that, no one could stop Kammas. Their caste grip, muscle power and political arrogance increased. They treated other caste people as menials. They committed atrocities on helpless people. They raided houses and harassed poor women sexually. Venkatesu, a Kamma youth and son of Yerram Kanna, went to the house of Tirupataiah and Yerukula, and misbehaved with his daughter. Tirupataiah and his wife tried to stop him. Venkatesu assaulted the couple. A few Dalit youth were watching the Kamma youth's unruly behaviour. They intervened and forcibly stopped Venkatesu from teasing Tirupataiah's daughter. Kammas took this incident as an affront to their caste supremacy. Malas, Madigas and Yerukulas were living side by side in Karamchedu. Kammas' kalyanamandapam (marriage hall) was located nearby. Dalit women used the nearby bund as an open toilet. Kamma youths, particularly Lakshmaiah, son of Gotori Burraiah, llamma, grandson of Munirattaiah, Venkateswarlu (Venkatesu), son of Yerram Kanna, teased them. The Madiga youth put an end to their beastly games. Kammas were naturally peeved at the Dalit youths' intervention. After NTR had formed Telugu Desam Party, all Kammas jumped into it. Dalits remained in the Congress Party. An eyesore for Kammas. Elections were announced. NTR's son-in-law and Chenchuramaiah's son Daggubati Venkateswara Rao contested for the MLA seat. Chenchuramaiah came to the Madigapalle and met the elders. 'My son is contesting. You all should vote for him,' he said. The latter said they would have to think about it. On the election day, polling was in progress. Dalits were voting for the Congress Party. The TDP agents obstructed Dalits, pushed them out and tried to shut the booth doors. Dalits resisted. The TDP agents and hooligans clashed with them. In the evening on the same day, about 300 Kammas surrounded the Madigapalle. Undaunted, Madigas faced them. Kammas, taken aback, retreated. From then on, Kammas spit venom on the Madigas and waited for a pretext to pick up a row with them.
July 16, 1985
Kamma youth, Potina Seenu and Rayineedu Prasad, took their buffaloes to the drinking water tank in the Madigapalle. They fed the buffaloes with washings of rice in buckets. While they were washing the dirty buckets in the tank, Katti Chandraiah, a Dalit boy, objected to it. His courage angered Seenu and Prasad. They were about to beat up Chandraiah when Munnangi Suvaartha, a Madiga woman, came to the tank to collect water. She tried to protect the boy from the attack of Kamma youths. Seenu and Prasad threw hunters at her. She lifted her vessel and warded off the hunters. Suvaartha's lifting of vessel in self-defence became a pretext for Kammas, who were itching for a fresh quarrel with Madigas after the election clash. They used the trivial occasion for a ghastly attack on Madigas. 'A Madiga woman lifted the vessel to attack Kammas. There was no meaning for our caste domination,' fumed Kammas. But they knew that they alone could not attack Madigas. They mobilised Kammas of seven surrounding villages, swooped on the Madigapalle on July 17th morning. They raided every Dalit's house, drove Madigas into fields. The blood thirsty Kammas beat Madigas, stabbed them and axed them. They raped Dalit women. They became murderers and barbarians. They chased and hunted Madigas for over 7 km. The murder and mayhem had no parallel in the Indian subcontinent. It was no exaggeration. Duddu Moshe, Duddu Ramesh, Tella Yehoshua, Tella Moshe, Tella Muthaiah and Duddu Abraham were axed to death by Kammas. In fact, eight Dalits were killed in the Kammas' attack. Police did not show two bodies to the victims and secretly buried them.
Details of the six slain Dalits
1. DUDDU VANDANAM
Age : 35
Wife : Subbulu
Mother : Alisamma
Father : Sujnanam
Son : Samuel (10 years)
Daughters : 1) Jayalakshmi (10)
2) Punnamma (7)
3) Sunitha (4)

2. DUDDU RAMESH
Age : 22
Wife : Sulochana (18)
(Married just a year ago)
Mother : Sundaramma (dead)
Father : Yohan

3. TELLA YEHOSHUA
Age : 55
Wife : Chinnammi
Sons : 1) Kotaiah (30)
2) Adiah (24)
Daughters : 1) Padma (27)
2) Suhasini (22)

4. TELLA MOSHE
Age : 70
Wife : Veeramma
sons : 1) Kripa Rao (35)
2) Ravi (29)
Daughters : 1) Ruthumma (37)
2) Deenamma (32)
3) Rattamma (25)

5. TELLA MUTHAIAH
Age : 45
Wife : Atchimma
Sons : 1) Papaiah (25)
2) Lakshmaiah (18)
3) Prabhakar Rao (11)
4) Kishore (9)
Daughters : 1) Mariamma (16)
2) Eeramma (4)

6) DUDDU ABRAHAM
Age : 40
Wife : Ahalya
Mother : Atchamma
Father : Rattaiah
Son : 1) Srinivas (20 )
2) Venkateswarlu (10)
Daughters : 1) Padma (7)
2) Chittemma (4)

The economic and social background, which prompted the upper caste people to indulge in murder and arson, should be studied to understand the nature of the Karamchedu carnage.

ప్రకృతి భాష

సముద్రం
కొండ చరియలను
తాకినపుడు అందం
అనంతమైనదాన్ని
పట్టి పుడిసిలించినట్లు అనుభూతి
శిల్పంలో
సజీవతే కాదు
వైజ్ఞానికతావుంది
ఏ శిల్పి నైపుణ్యమైనా
అది సృష్టిలోని సౌందర్యాభివ్యక్తే.

అవును
ఎన్నో అభివ్యక్తులు శిలా సదృశాలే
మనిషికి
దేనికి స్వేఛ్చవుంది
ఏ విలువల కోసం పోరాడుతున్నామో
అవి సంకెళ్ళు బిగిస్తాయి.
ఆధార ఆధేయితాల పెనవేత
తగ్గేకొలదీ
ఏపుగా పెరుగుతున్న
సరిగ చెట్టులా
ఒంటరి సంగీతం

అవును! నిజమే
తోడు గొప్పదే
అక్షరాలు తోడు కోల్పోతే
భావ శున్యమైనట్టు
అవును!
భయం ఒక భూతంమే
చల్లగాపారుతున్ననదిని కూడా
విసురుతున్న తుఫానులాగే భావిస్తుంది
నిజమే! ఆ నది
పాయలు పాయలుగా
విడిపోతున్న చోట
బొట్లు సందిగ్ధంలోనే ఉన్నాయి!
ప్రకృతిది సహజ సౌందర్యం
ఒక్క  గడ్డిపూవు చాలు
ఎంత ఎత్తైన కొండకు కూడా
కిరీటమే

నిజమే!
అది కారపు బంతిపువ్వే
నీళ్ళ పోత కూడా లేకుండా
మంచులో పెరిగింది
ఆ  పక్కన గట్టుమీద
పుట్ట కొక్కులు
సహజంగానే మోలిశాయి
అవును!
ఆ  కృత్రిమ ఉద్యానవనాల కంటే
యివే నన్ను ఆకర్షిస్తున్నాయి
వీటికి సూర్యుడు తెలుసు
వెన్నెల తెలుసు
మనిషి వెలుగులో వున్నాననుకొని
అంధకారంలో వున్నాడు

సరిగా ఆ సూర్యుణ్ణి చూడగలిగితే
ఈ మెర్క్యురీ లైట్ల కూసం
ఆరాటం ఎందుకు?
కొన్నిసార్లు కళ్ళు మాట్లాడీ
మాట్లాడీ అలసిపోతాయి
అభివ్యక్తి శూన్యతను అంతా
కనురెప్పలే మోయాలి
ఇసుక తిన్నెల మీద
ముద్రించిన ప్రతి అడుగు
శిలా శాసనమే,
అడుగులు కూడా అన్నిసార్లు వేయలేము
చరిత్ర అనేక అస్తికలను
మిగిల్చింది
వాటి ఆరాటం సముద్రంలో
ఘోష పెడుతూనే వుంది

నిజమే!
ముగింపు లేనిదే మౌనం
దానికి అనంత భాష
ప్రకృతి దాని బడి
జీవన వ్యవస్థలన్నీ
ప్రతిఫలిస్తాయనేదే ఆశ
అటు వేపే నా పయనము...
నడుస్తున్న చరిత్ర జూలై 2011 సంచికలో ప్రచురించబడినది.

కోటగోడలు కూల్చేస్తుంది

                                                                                                   15.7.11
మన ఆర్ధికామత్యులు
ప్రణబ్ దృష్టిలో
రూపాయి అంటే
వస్తువులు కొనేది
కానీ, వాటికి ముందు
పప్పులు ఉప్పులు
కొనాలికదా!

గుడిశే చూడనివాడికి
ఆరిపోయిన పొయ్యి గురించి
ఏమి తెలుసు?
కట్టెల మోపు గురించి
ఏమి తెలుసు?

పేదరికం ఒక సమస్య
కాదు సుమా!
దానికి కోటగోడలు కూల్చే
శక్తి వుంది మరి!

ఉగ్రవాదం ఏదైనా అమానవత్వమే

                                                                                         14.7.11
ముంబైలో అనునిత్యం
బాంబు బ్లాస్ట్లు
ఉగ్రవాదం ఏదైనా
అమానవత్వమే
ప్రపంచంలో పారిన
నెత్తురులో సగంపాలు
మతోన్మాదానిదే
మనిషి వివేచనను
పెంచే ఒక్క పాటశాల
మనకు లేదుకదా!
ఏ విత్తు విత్తితే
ఆమొక్క మొలవదా!

ఉపరితలం కాదు బుర్రనే మార్చాలి

                                                                                 13.7.11
సంస్కరణలన్నీ
ఫేస్ పౌడర్ల లాంటివే
వ్యవస్థ పునాదిని మార్చాలంటే
ఆలోచనల్లో మార్పురావాలి


సి. బి. ఐ ఒక పక్క
అవినీతిని తవ్వుతుంది
మరోపక్క దేవాలయాల్లో
అంతర్దేవాలయాలు
తవ్వేకొద్దీ పుత్తడి నిధులు


ఒకడి కాలుతున్న పొట్టకు
రొట్టె లేదు
ఒకడికి ఆచారం పేరుతొ
నేతి గారెలు


ఈ దేశానికి ఉపరితలం కాదు
బుర్రనే మార్చాలి.

అప్పుడందరూ గమ్యానికే చేరతారు!

                                                                                                               11.7.11
రైలుబోగీలు అగ్గిపెట్టేల్లా
కూలుతున్నాయి
నెత్తురు కాల్వలైనా
జలపాతాల సౌందర్యంలా
మంత్రులు వీక్షిస్తున్నారు
వీరికి మంత్రాంగం తప్ప
యంత్రాంగం లేదు
ఇంగ్లీషువారు నిర్మించిన
పురాతన పట్టాలకు
శీలలు గొట్టేవారులేరు
రాజ్యానికైనా
మనిషికైనా
శీలమే బిగువు
అప్పుడందరూ
గమ్యానికే చేరతారు.

ఆలోచించే మానవుణ్ణి సృష్టించండి

                                                                              10.3.11                                                                                                        
మెదడులేని జనాభా
ఎంత ఎదిగితే ఏముంది?
ఆహారం కోసం పోరాటం తప్ప
ఆలోచించే శక్తిలేదు
దేశంలో దాన్యాగారాలన్నీ
పందికొక్కులకే ఎరవుతున్నాయి
పిల్లలకివ్వాల్సిన బొక్కుల గూడాల్లో
చెదలు బడుతున్నాయి
మంత్రివర్యుల సమాలోచనలన్నీ
దారిద్రియాన్ని
భావదారిద్రియాన్ని
కాపాడడానికే
ముందు ఆలోచించే మానవుణ్ణి
సృష్టించండి
తరువాత జనాభా పెరిగినా
విశ్వం వారిని భరిస్తుంది.

ప్రతి రాజూ హంతకుడే!

ప్రతి రాజూ హంతకుడే!
రాజకుమారులు ఆ సమాధుల
సంఖ్యను పెంచేవారే
వీరు చేసే కీర్తనలన్నీ
మరణ గీతాలే
జీవించేవాడు ఒక్కడే
సమాజ గతిని నిర్ణయించేవాడే
వాడే దార్శనికుడు!

నిజానికి యుద్ధం
యిప్పుడే ఆరంభమయింది
జీవితంతోనూ! సమాజంతోనూ!
మనిషి తననుతాను
తెలుసుకునే లోపే
మరణించడం ఒక సత్యం
యుద్ధ ప్రియులే జీవిస్తున్నారు
జీవించినప్పుడూ
మరణించినప్పుడు..

కులం


కులం ఒక సామాజిక నిర్మాణం కాదు
ఒక సామాజిక విభజన
కుల అస్తిత్వవాదం
కుల నిర్మూలనకు దారి తీయాలి
అంబేడ్కరిజం ఒక్కటే
జాతీయతకు మార్గం
మానని గాయానికి
మైపూతలు పూసినంతకాలం
పుండు పుండే
మందు మందే
 
Dr. Kathi Padma Rao