వీక్షకులా... ఆలోచనాపరులా...

                                                                                                 ౧.౮.11
నిర్భాగ్యులూ, అనాధలూ,
నిరాశ్రయులు పెరుగుతున్నారు.
కోట్లకు పడగలెత్తిన వారి
బంగళాలూ పెరుగుతున్నాయి.

ఈ వైరుధ్యాల మధ్య
ప్రభుత్వం ఒక నాటక శాల.

అవును!
ఆలోచించని వారే ఘనులు
ఆలోచిస్తే అంతరాలు సాక్షాత్కారం
విద్యావంతులు దేశాన్ని
కంటతా పెడుతున్నారా!
వీక్షకులుగా మిగులుతున్నారా!

ఏ మనిషైనా
పురోగామిస్తే అంబేద్కర్.
తిరోగామిస్తే గాంధీ.
 

No comments:

Post a Comment