రాజ్యాంగానిదే విజయం

                                                                                22.8.11
అవినీతి పతాకలెత్తి
నడుస్తున్నాడు జగన్
ప్రతి రాజు మరణం వెనుక
ఒక పెద్ద కుంభకోణమే ఉంది.

విదిలించిన మరమరాలకు
వచ్చిన కీర్తి అపారం.
దోచేసిన ధననిధులఫై
లేదు నిఘా!

రాజుల కొడుకులందరూ మళ్ళీ ప్రభువులైతే
ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటి ?
ముందు గొయ్యని తవ్వనివ్వండి
బాబులు, బాబాలు, స్వాములు
అందరూ దొరుకుతారు

ఇప్పుడు న్యాయస్థానం
అంబేద్కర్ మార్గంలో నడుస్తుంది
ఇక రాజ్యాంగానిదే విజయం.

No comments:

Post a Comment