అన్నా హజారే పోరాటం అర్థసత్యమే

                                                                                                   22.8.11
రామలీల మైదానంలో కేకలు 
భారత పార్లమెంటులో
రణగొణ  ధ్వనులు

ఎవరిని దించి
ఎవరిని ఎక్కిస్తారు ?
అందరూ!  ప్రజల సొమ్ముతో
పల్లకీలు ఎక్కిన వారేగా !!
ఊరు బయట వాడ
గట్టిన  ధర్మజ్ఞులేగా...

మనుషులను విడదీసిన
ధర్మ దండం వీరిది
అస్పృశ్యతా నిర్మూలన కోసం
గాంధేయ మేమైయ్యింది?

మనిషిని మనిషి
అంటుకోకపోవడం నేరం కాదా ?
దానిపై కొరడా ఎత్తరే!!

మరో స్వతంత్ర  పోరాటం
చేయవలసింది దళితులే ....
వారి శ్రమకు ఈ దేశం
ఋణపడి వుంది.

 

No comments:

Post a Comment