అప్పుడందరూ గమ్యానికే చేరతారు!

                                                                                                               11.7.11
రైలుబోగీలు అగ్గిపెట్టేల్లా
కూలుతున్నాయి
నెత్తురు కాల్వలైనా
జలపాతాల సౌందర్యంలా
మంత్రులు వీక్షిస్తున్నారు
వీరికి మంత్రాంగం తప్ప
యంత్రాంగం లేదు
ఇంగ్లీషువారు నిర్మించిన
పురాతన పట్టాలకు
శీలలు గొట్టేవారులేరు
రాజ్యానికైనా
మనిషికైనా
శీలమే బిగువు
అప్పుడందరూ
గమ్యానికే చేరతారు.

No comments:

Post a Comment