కార్పొరేట్లకు దాసోహం పేదలకు రిక్త హస్తం!
June 7, 2012
ఏదీ తేల్చని వర్కింగ్‌ కమిటీ సమావేశం
ప్రధానిని రక్షించే పనిలో అధినేత్రి
అంతుపట్టని ద్రవ్యోల్బణం మూలాలు
బొగ్గు గనుల కుంభకోణంలో సతమతం
ప్రత్యామ్నాయ వ్యవస్థే శరణ్యం 

Soniaఇటీవల జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశ వివరాల్ని గమనిస్తే, జాతీయోద్యమాన్ని నడిపి ఎంతో ప్రతిష్ఠ తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టిందా అని ఎవరెైనా ఆశ్చర్యపోతారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతూ, అనేక రాష్ట్రాల్లో ఓటమికి గురవుతూనే ఉంది. తన నాయకత్వంలోని యూపీఏ పాలన మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా అనేక గొప్పలు చెప్పుకుంది. చివరకు స్వయంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్‌ను ఆరోపణల బారినుంచి రక్షించుకోవలసిన దశకు పార్టీ చేరింది. ఆమ్‌ ఆద్మీ నినాదంతో గద్దె నెక్కిన యూపీఏ-2 మంత్రివర్గంలో ప్రణబ్‌ ముఖర్జి, శరద్‌ పవార్‌, కపిల్‌ సిబాల్‌, జయరామ్‌ రమేష్‌, కిశోర్‌ చంద్రదేవ్‌ వంటివారి శాఖల్లో కూడా ప్రావీణ్యత కనపడడం లేదు. 14 మంది కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్నా హజారే బృందం సంధిస్తున్న బాణాలకు క్షతగాత్రులు కావడమేకాని తిరిగి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు.

సోనియా గాంధీకి భారతదేశం అర్థం కాలేదు. కాంగ్రెస్‌లో పెద్ద మనుషులు గా చెలామణి అవుతూ తన వెంట నడుస్తున్న వారిలో ఎక్కువ మంది కార్పొరేట్ల గొడుగు నీడలో ఉన్నారని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ పరిపాలన గాడితప్పి, జీడీపీ స్థాయి 9 నుంచి 6 శాతానికి పడిపోతుంటే దాని మూలాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆహార ధాన్యాల్ని ఇతర దేశాలనుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకుంటూ, రెైతులకు గిట్టుబాటు ధరలేక జీవించే హక్కును కోల్పోతున్న వెైనానికి మూల కారణం ఏమిటో ఆమె అర్థం చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటొకటిగా కూలుస్తూ, ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ బి. మిట్టల్‌, అనీల్‌ అగర్వాల్‌, మాలెైన్‌ పీటర్స్‌, లక్ష్మీ మిట్టల్‌, కె.ఎం. బిర్లీ, అనిల్‌ అంబానీ, శశి రూయా, సజ్జన్‌ జిందాల్‌ వంటి ప్రెైవేట్‌ పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు దాసోహమంటున్నారు.

దేశ సంపదను, మూల వనరులను ఇటివంటి వారందరికీ తాకట్టు పెట్టడంవల్ల దేశం అధోగతి పాలవుతుందని సోనియాగాంధీ గానీ, ప్రధాన మంత్రిగానీ గుర్తించక పోవడమే ద్రవ్యోల్బణం నానాటికీ పెరగడానికి కారణమవుతోందని తెలుసుకోలేక పోతున్నారు. నానాటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వర్కింగ్‌ కమిటీ వివరించలేక పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధర ఎందుకు పెరుగుతుందో వర్కింగ్‌ కమిటీ తేల్చలేకపోయింది. ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో పాత్రధారులెైన అధికార బృందం ఆర్‌.ఎస్‌. గుజ్రాల్‌, జె.ఎస్‌. శర్మ, పులో్‌ ఛటర్జీ, జోహ్ర ఛటర్జీ వంటివారి తప్పుడు నడకల వల్ల కార్పొరేట్‌ సంస్థలకు మేలు కలుగుతూ ప్రభుత్వ రంగ సంస్థలు శిథిలమౌతున్న విషయంపెై నోరు విప్పలేక పోయారు.

అన్ని వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, సామాన్యుడి మీద పన్నుల భారం ఎందుకు పడుతున్నది, విద్యుత్తు, నీరు, విద్య, ఉపాధి రంగాలన్నీ ఎందుకు కుంటుపడుతున్నాయనే అంశాలమీద నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. పొరుగు దేశం చెైనా స్ర్తీల శ్రమశక్తిని వస్తూత్పత్తికి ఉపయోగించి ప్రపంచ దేశాలకు వస్తువులు ఎగుమతి చేసుకోగలుగుతోంది. క్రియాశీలకమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. 2 జీ స్ప్రెక్ట్రమ్‌లో లక్ష 76 వేల కోట్ల రూపాయల ధనాన్ని రికవరీ చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నదో ప్రభుత్వం వివరించలేకపోతోంది. అవినీతి పరుల విషయంలో సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా కాని అరెస్టులు చేయడం లేదు. మళ్లీ వారు బెయిళ్లపెై బయటకు వస్తున్నారు. విద్యా వ్యవస్థను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నించకుండా దాన్ని కూడా చివరకు అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా అట్టడుగు కులాల ప్రజలు ఉన్నత విద్యను అందుకొనే అవకాశాలు అంతరిస్తాయి.

పాశ్చాత్యీకరణ చెందుతున్న ఉన్నత విద్యలో ఉపాధి కల్పన కంటే ఇతర హంగులే ఎక్కువ. విద్యకు ప్రభుత్వం పెట్టే ధనం కూడా పెట్టుబడిగా మారి ధనవంతుల పిల్లలే ఉన్నత విద్యను, కార్పొరేట్‌ విద్యను అందుకోగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కపిల్‌ సిబాల్‌ జాతీయ విద్య పేరుతో ఇంగ్లీష్‌ ప్రాధాన్యాన్ని పెంచి, జాతీయ భాషలెైన హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, ఒరియా వంటి ప్రాంతీయ భాషల్లో పుట్టి పెరిగిన దళిత బహుజన మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నతంగా ఎదగకుండా చేస్తున్నారు. ఫలితంగా రాబోయే తరాల్లో ధనికుల విద్యకు- బడుగు వర్గాల విద్యకు దేశ వ్యాప్తంగా అంతరం ఏర్పడి ఒకే దేశంలో ఇంగ్లీష్‌ సంస్కృతికి, దేశీయ సంస్కృతికి చెందిన పిల్లలు రెండు తెగలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది.ఇప్పుడు ప్రధాన మంత్రి మీద వచ్చిన బొగ్గుకు సంబంధించిన ఆరోపణలు కూడా తక్కువేమీ కావు. 2006-09 మధ్య కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాని అజమాయిషీలో ఉండగా జరిగిన కేటాయింపులపెై ‘కాగ్‌’ నివేదిక- కేంద్ర పాలకుల వెైఫల్యాన్ని ఎండకట్టింది.

‚దేశానికి బొగ్గు అతి కీలకమైనది. భారత దేశంలోని అన్ని పరిశ్రమలు బొగ్గు మీదే ఆధారపడి నడుస్తున్నాయి. బొగ్గు భారతీయుల జీవన వనరు. ఆ శాఖ శిబూ సోరెన్‌ దగ్గరి నుంచి ప్రధానమంత్రి చేతికి వచ్చింది. మునుపటినుండి జరిగిన అవకతవల్ని కాగ్‌ నివేదిక బయట పెట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 10 వేల 64 లక్షల కోట్ల నష్టం వాటిల్లిం దని కాగ్‌ నివేదిక పేర్కొంది.
2004-09 మధ్య కాలంలో 156 కోల్‌ బెల్టులను 100 ప్రెైవేటు కంపెనీలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు కేంద్రప్రభుత్వం కట్టబెట్టిన వెైనంపెై కాగ్‌ ముసాయిదా నివేదికను రూపొందించింది. లబ్ధి పొందిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, టాటా గ్రూప్‌, అదిత్య బిర్లా గ్రూప్‌ వంటి ప్రెైవేట్‌ సంస్థలతో పాటు ఎన్‌టీపీసీ, పలు రాష్ట్రాల విద్యుత్‌ బోర్డులున్నాయని పేర్కొంది. ఈ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం బొగ్గుగనులను చాలా తక్కువ ధరకు విలువ కట్టిందని, వేలంపాట నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరి ఉండేదని కాగ్‌ వ్యాఖ్యానించింది.

ఈ నివేదికలన్నింటిని అనేక పత్రికలు తమ పరిశోధనాత్మక జర్నలిజంద్వారా బయటపెట్టేవరకు ప్రభు త్వం దాచి ఉంచడం వల్ల దేశ ప్రయోజనాలు కుంటుపడుతున్నాయి. నిజానికి బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ సంస్థలకు ఉన్న సామర్థ్యం ప్రెైవేట్‌ సంస్థలకు లేదు. 155 కోల్‌బెల్ట్‌లను 100 ప్రెైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల భారతదేశ సామాజిక సంపదకు జరుగుతున్న నష్టాన్ని కాంగ్రెస్‌ పూడ్చగలదా! దీనంతటికీ కారణం- ప్రధానమంత్రి నీతిమంతుడనే కితాబిచ్చి సరళీకరణ, ప్రెైవేటీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ, కార్పొరేటీకరణలను ముమ్మరం చేసి, పాలకపక్ష మంత్రులు, ఎంపీలు కోట్లకు పడగలెత్తుతున్నారు.
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జయరామ్‌ రమేష్‌ ఉపాధి హామీ పథకాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అది మట్టి తీసి మట్టేసే పథకం, అందులో సృజనాత్మకత లేదు, ఉపాధికి హామీ లేదు, గ్రామాల పునరుజ్జీవనం లేదంటున్నారు. పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందితే చాలు పర్యావరణం కుంటుబడినా సరే అని అంటున్నారు.

మరొక వెైపు ప్రధాన మంత్రి- భారత దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆర్థిక రంగానికి గడ్డు కాలం వస్తుంది, అనేక అంశాలు మా నియంత్రణలో లేవు అంటున్నారు. దీనికంతటికి కారణం ఎక్కువ మంది పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఏజెంట్లు ఎంపీలుగా ఎన్నికై తమ వ్యక్తిగత సంపదను పెంపొందించుకునే దిశగా దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ఎంపీలు ముందంజలో ఉన్నారు.ఇంత వరకూ దేశ ప్రజలకు 40 శాతం మందికి అక్షరాలు నేర్పుకోలేకపోయాము. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి రూ. 3 నుంచి పెంచలేకపోయారు. పిల్లలు నడి ఎండలో చారుతో అన్నం తింటున్నారు. వారికి పప్పుదినుసులు అందించలేకపోతున్నారు. జెైలులో ఉన్న రాజకీయ నాయకులను, కార్పొరేట్‌ దొంగలను మాంసం, గుడ్లు, పాలు, పండ్లు ఇచ్చి ప్రభుత్వ డబ్బుతో మేపుతున్నారు.

వారిని కోర్టులకు తెచ్చేటప్పుడు బులెట్‌ ప్రూఫ్‌ కార్లలో తీసుకువస్తూ, పది కిలోమీటర్ల దూరంవెళ్ళి చదివే ఆడపిల్లలకు ఒక సైకిల్‌ కొనిపెట్టలేకపోతున్నారు. దొంగలు దొరలుగా, పారిశ్రామిక వేత్తలుగా సొంత విమానాలు కొనుక్కొని రాజకీయ నాయకులుగా, కుల పెత్తందారులుగా మారి ఆయా రాష్ట్రాల్లో సొంత టీవీలు, మందీ మార్బలంతో పాటు గూండాల్ని ముఠాలుగా చేసుకొని ప్రభుత్వ సంపదను దోచుకుంటూ సొంత దళారీ వ్యవస్థలు ఏర్పరచుకొంటున్నారు. ఈ అవినీతి నేతల బాగోతం సోనియా గాంధీకి తెలియదా? 80 ఏళ్లనాడే డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ విషయాలను పసిగట్టి ‘వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హ్యెవ్‌ డన్‌ టుది అన్‌టచబుల్స్‌’ అనే గ్రంథంలో కాంగ్రెస్‌ బ్రాహ్మణ- బనియాల పార్టీగా చెప్పాడు.

padmaraoబీజేపీ ఇంతకంటే సాంప్రదా యక హిందూ కుల, వర్ణ దోపిడీ వివక్షతో కూడుకున్న పార్టీ. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుల వర్గ ఆధిపత్య పెత్తందారీ తనంతో రాష్ట్రంలోని పేదలను దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితిల్లో దేశ వ్యాప్తంగా దళిత బహుజన మైనారిటీ, ఆదివాసీలు రాజకీయంగా చెైతన్య వంతమై మహాత్మా ఫూలే, అంబేడ్కర్‌ల ఆలోచనావిధానంతో ఈ దేశ సంపదను, ఈ దేశ వనరులను, ఈ దేశ మేధోశ క్తిని ఈ దేశ ప్రజలకే ఉపయుక్తమయ్యే రాజ్య వ్యవస్థ నిర్మాణానికి పూను కోవలసిన చారిత్రకసందర్భం ఇది. ప్రత్యామ్నాయ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణానికి సన్నద్ధం కావటమే కర్తవ్యం.

No comments:

Post a Comment